సన్నవడ్లకు బోనస్ ప్రకటనపై రైతుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. బోనస్ పేరుతో ప్రభుత్వం తమను దారుణంగా మోసం చేసిందని మండిపడుతున్నారు. ధాన్యానికి బోనస్ ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి ఓట్లు దండుకొని ఇప్పుడు సన్నవడ్లకే అని చెప్పడం భావ్యం కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమలు చేతకానప్పుడు హామీ ఇవ్వడం ఎందుకని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.