విమానం ఇంజన్ లో మంటలు.. తప్పిన పెను ప్రమాదం (వీడియో)

హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్న మలేషియా ఎయిర్ లైన్స్ విమానంకు పెను ప్రమాదం తప్పింది. టేక్ ఆఫ్ అయిన 15 నిమిషాలకే కుడివైపు ఇంజిన్ లో మంటలు రావడంతో పైలట్ గుర్తించి వెంటనే లాండింగ్ కి అనుమతి కోరారు. ప్రమాద తీవ్రతను గుర్తించి అత్యవసర లాండింగ్‌కు ఏటిసి అనుతించింది. కాగా విమానం సుమారు 3 గంటలు గాలిలోనే చక్కర్లు కొట్టింది. విమానంలో సిబ్బందితోపాటు 130 మంది ప్రయాణికులు ఉన్నారు. సేఫ్‌గా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్