హైదరాబాద్ లో గేమింగ్ ముఠాను పోలీసులు గుట్టు రట్టు చేశారు. నగరానికి చెందిన మాధవి అనే మహిళ బడా వ్యాపారులకు వల వేసి ఖాజాగూడలో ఏకంగా ఓ గేమింగ్ స్థావరాన్నే నడుపుతోంది. గేమింగ్ లో పాల్గొని ఇటీవల కొంతమంది బడాబాబులు రూ.లక్షల్లో నష్టపోయారు. దీంతో సమాచారం అందుకు టాస్క్ఫోర్స్ పోలీసులు గేమింగ్ స్థావరంపై ఆకస్మికంగా దాడి చేశారు. రూ.62 వేల నగదును సీజ్ చేసి 9 మందిని అరెస్ట్ చేశారు. వారిపై గేమింగ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.