డీసీఎం ఢీకొని యువకుడు మృతిచెందిన ఘటన HYD పటాన్ చెరు పరిధిలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. పడమటి లక్ష్మణ్ అనే యువకుడు స్థానిక గుమ్మడిదలలోని బంధువు అంత్య క్రియలకు బైక్ పై వెళ్లి వస్తున్నాడు. ఈ క్రమంలో వీరన్నగూడ ప్రధాన రహదారిపై ఎదురుగా వస్తున్న డీసీఎం అదుపు తప్పి బైక్ ను ఢీకొట్టింది. ప్రమాదంలో లక్ష్మణ్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందాడు.