నేడు గుజరాత్తో జరిగే మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ గెలుపొందితే 16 పాయింట్లతో ప్లేఆఫ్స్కు చేరనుంది. దీంతో పాటు 19న పంజాబ్తో మ్యాచ్లోనూ హైదరాబాద్ గెలుపొందితే పాయింట్స్ టేబుల్లో 2వ స్థానానికి చేరుతుంది. ఇది జరిగితే పాయింట్స్ టేబుల్లో మొదటి స్థానంలో ఉన్న కోల్కతా నైట్ రైడర్స్తో కమిన్స్ సేన క్వాలిఫయర్-1 మ్యాచ్ ఆడనుంది. అందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు చేరుతుంది. ఓడినా ఫైనల్ చేరేందుకు మరో ఛాన్స్ ఉంటుంది.