తెలంగాణలో అమలవుతున్న ఆసరా పింఛన్ల పంపిణీపై కాగ్ అభ్యంతరం తెలిపింది. పింఛన్ల పంపిణీలో గోల్మాల్ జరిగిందని తేల్చింది. 2018-21 ఆర్థిక సంవత్సరాల మధ్య ఆడిట్ చేసిన కాగ్.. సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా ఆసరా పింఛన్లను పంపిణీ చేశారని నివేదికలో తెలిపింది. 2018-21 మధ్య కాలంలో సగటున నెలకు 2.3లక్షల మందికి పింఛన్ల చెల్లింపు జరగలేదని తెలిపింది. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 16% మందికి అర్హత లేకున్నా పింఛన్లు జారీ చేసినట్లు పేర్కొంది.