భారత మాజీ క్రికెటర్ వసీమ్ జాఫర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన యూట్యూబ్ ఛానెల్లో జాఫర్ మాట్లాడుతూ.. 'T20 వరల్డ్కప్ ముగిసిన తర్వాత T20 క్రికెట్కు రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తారని అనుకుంటున్నా. ఇది వారి స్వీయనిర్ణయం కావొచ్చు లేదా సెలెక్టర్లు వారిని తొలగించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. IPLలో వాళ్లిద్దరు కొనసాగవచ్చు కానీ, అంతర్జాతీయ T20ల్లో మాత్రం వారిని చూడటం ఇదే చివరిసారి కావొచ్చు' అని చెప్పుకొచ్చాడు.