గవర్నర్ తమిళిసై ప్రసంగం దారుణంగా ఉందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలో ఆయన మాట్లాడుతూ.. గత కేసీఆర్ ప్రభుత్వంపై గవర్నర్ నిందలు వేశారని మండిపడ్డారు. ప్రజల పక్షాన ప్రశ్నించడంలో కేసీఆర్ కంటే పదునైన గొంతు దేశంలో లేదని అన్నారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదా? అని ప్రశ్నించారు. రేవంత్రెడ్డి పలికేవన్నీ ప్రగల్భాలేనని.. దిల్లీ మేనేజ్మెంట్ కోటా సీఎం రేవంత్ అని సెటైర్లు వేశారు.