తెలంగాణలో జూన్ 9న జరగబోయే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా వేయాలని BRS నేత, ఆర్.ఎస్ ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. జూన్ 9నే ఇంటెలీజెన్స్ బ్యూరో పరీక్ష కూడా ఉందని.. చాలామంది నిరుద్యోగులు ఐబీ పరీక్ష రాస్తున్నారని చెప్పారు. ఎన్నికల వల్ల ప్రభుత్వ ఉద్యోగులు గ్రూప్-1కు సిద్ధం కాలేదన్నారు. నెల సమయం ఇస్తే గ్రూప్-1కు బాగా సన్నద్ధం అవుతారని చెప్పారు.