ఉత్తరాఖండ్లోని లక్సర్ రైల్వే స్టేషన్లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. స్టేషన్లో రైలు కదలడాన్ని ఓ వ్యక్తి గమనించాడు. రన్నింగ్ ట్రైన్ ఎక్కేందుకు ఆ వ్యక్తి ప్రయత్నించాడు. అయితే పట్టు తప్పి జారిపడ్డాడు. రైలుకు, ప్లాట్ఫారానికి మధ్య ఇరుక్కుపోయాడు. ఆ గ్యాప్లోనే చాలా సేపు ఉండిపోయాడు. చివరికి ట్రైన్ ఆపి అతడి ప్రాణాన్ని రైల్వే పోలీసులు కాపాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.