శివమ్ కుమార్ అనే వ్యక్తికి రాజబేటి అనే మహిళతో రెండేళ్ల క్రితం వివాహమైంది. ఇటీవల ఆరు నెలల క్రితం వారికి ఆడబిడ్డ పుట్టింది. ఆ చిన్నారికి 'నిహారిక' అని పేరు పెట్టారు. అయితే ఇవాళ భార్యాభర్తలిద్దరికీ ఆస్తి విషయంలో గొడవ జరిగింది. దీంతో ఆగ్రహించిన రాజ్బేటి తన కూతుర్ని దారంతో గొంతు నులిమి చంపేసింది. ఈ విషాద ఘటన యూపీలోని షాజహాన్పూర్లో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి రాజ్బేటిని అరెస్ట్ చేశారు.