సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవం

సిఐటియు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చాంద్రాయణ గుట్టలో గురువారం సిపిఎం నాయకులు జెండాను ఆవిష్కరించారు. సిఐటియు నియోజకవర్గ ఇన్చార్జ్ కిషన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ. కార్మిక సంఘాలను ఐక్యం చేయడంలో సిఐటియు పాత్ర ఎంతో కీలకమన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చాక కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కోటయ్య, రామ్ కుమార్, కృష్ణా నాయక్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్