'టోర్నీలో నేను జట్టుకు ఎంత చేయాలనుకున్నానో.. అది చేయలేకపోయాను. ఈ విషయాన్ని కోచ్ ద్రవిడ్కు చెప్పేశాను. ‘జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు నువ్వే అండగా నిలుస్తావన్న నమ్మకం నాకుంది’ అని ఆయన ధైర్యం చెప్పారు. 'ఫైనల్ మ్యాచ్లో రోహిత్తో కలిసి ఓపెనర్గా వెళ్తున్నప్పుడు.. నాపై నాకే నమ్మకం కుదరలేదు. కానీ, తొలి ఓవర్లో 3 బౌండరీలు బాదేసరికి ధైర్యం వచ్చింది.’’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.