అమెరికాలో న్యూయార్క్ మైదానంలోని పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉండి బౌన్స్ అవుతూ బ్యాటర్లను ఇబ్బందికి గురిచేస్తోంది. మొన్న శ్రీలంక 77 పరుగులకు, నిన్న ఐర్లాండ్ 96 పరుగులకే ఆలౌట్ అయ్యాయి. ఈ నెల 9వ తేదీన ఇదే పిచ్పై భారత్, పాక్ జట్లు తలపడనున్నాయి. దీంతో పిచ్ మారుస్తారంటూ వస్తున్న కథనాలపై తాజాగా ఐసీసీ స్పందించింది. మ్యాచ్లను తరలించే అవకాశం లేదని తేల్చిచెప్పినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.