యాదాద్రి థర్మల్ ప్లాంట్లో మాజీ మంత్రి జగదీశ్రెడ్డి దోచుకున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆరోపించారు. సూర్యాపేటలో తాగేందుకు నీళ్లు లేక మూసీ నీళ్లు తాగుతుంటే, అవసరం లేకున్నా గత ప్రభుత్వం ఉత్తర తెలంగాణ కోసం కాళేశ్వరం కట్టిందని విమర్శించారు. నల్గొండ జిల్లాలో కేవలం ఒక్క సీటు మాత్రమే గెలిచిందని.. తాము ప్రచారం చేసి ఉంటే 70 వేల ఓట్లతో జగదీశ్ ఓడిపోయేవారని విమర్శనాస్త్రాలు సంధించారు.