కాంతారాలో నటించిన కన్నడ హీరోయిన్ సప్తమి గౌడ ఇప్పుడు తెలుగులో అడుగు పెట్టబోతోంది. 'కాంతార' సూపర్ హిట్ అయిన తర్వాత ఆమెకు చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ, ఈ అమ్మడు మాత్రం ఆచితూచి అడుగులేస్తోంది. సప్తమి గౌడ ఇటీవల మాట్లాడుతూ తెలుగులో నితిన్ సరసన నటిస్తున్నానని తెలిపారు. ’షూటింగ్ కూడా మొదలైంది. నేను వెళ్లి సెట్లో జాయిన్ అవ్వాలి‘ అని తెలిపింది.