తొమ్మిది నెలల బాలుడిని కిడ్నాప్ చేసి విక్రయించినందుకు ముగ్గురు మహిళలతో సహా ఐదుగురిని రాంచీ పోలీసులు అరెస్ట్ చేశారు. మే 12న రాంచీ రైల్వేస్టేషన్లో బాలుడిని అతడి తల్లిదండ్రుల వద్ద నుంచి అపహరించారని, మే 13న ఒడిశాలోని పూరీలో రూ.58,500లకు బాలుడిని విక్రయించారని పోలీసులు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకుని, బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించామని పేర్కొన్నారు.