విద్యుత్తు సరఫరాలో నేడు అంతరాయం

బెజ్జూరు, రెబ్బెన విద్యుత్తు ఉపకేంద్రాల పరిధిలోని 33 కేవీ లైన్ మరమ్మతుల నేపథ్యంలో ఆయా గ్రామాల పరిధిలో శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సరఫరాలో అంతరాయం కలుగుతుందని ట్రాన్స్కో ఏఈ అంజనీకుమార్ తెలిపారు. బెజ్జూరు మండలంలోని అన్ని గ్రామాలతో పాటు చింతలమానేపల్లి, డబ్బా, గూడెం గ్రామాల్లో సరఫరాకు అంతరాయం ఉంటుందని చెప్పారు. ఆయా గ్రామాల వినియోగదారులు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్