కెన్యా రాజధాని నైరోబీలో నిన్న అర్థరాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ భారీ పేలుడులో 165 మంది గాయపడ్డారు. పేలుడు శబ్ధం పెద్దగా వినిపించడంతో చుట్టుపక్కల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా, నైరోబీలోని ఎంబాకాసిలోని స్కైలైన్ ఎస్టేట్ సమీపంలోని కంటైనర్ కంపెనీలో పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకున్నారు.