మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను జేడీ(ఎస్) సస్పెండ్ చేసింది. మంగళవారం నిర్వహించిన పార్టీ కోర్ కమిటీ మీటింగ్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి తెలిపారు. పలువురు మహిళలను ప్రజ్వల్ రేవణ్ణ లైంగికంగా వేధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఇప్పటికే ఈ కేసును కర్ణాటక ప్రభుత్వం సిట్కు అప్పగించింది. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారు.