ఢిల్లీలో పాత పార్లమెంటు భవనంలోని సెంట్రల్హాల్లో NDA ఎంపీలు శుక్రవారం ఉదయం సమావేశమయ్యారు. మోదీ నాయకత్వానికి లాంఛనంగా ఆమోదముద్ర వేయనున్నారు. ఈ భేటీలో TDP అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సమావేశానికి 240 మంది BJP ఎంపీలతోపాటు ఇతర మిత్రపక్షాల ఎంపీలు, ఎన్డీయే పార్టీల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు హాజరయ్యారు. మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేయనున్నారు.