రూ.500 నోటుపై రాముడి చిత్రం ముద్రించనున్నట్లు కొన్నాళ్లుగా జరుగుతున్న ప్రచారంపై కేంద్ర ప్రభుత్వ సంస్థ PIB స్పందించింది. ఈ వార్తలో నిజం లేదని, అది ఫేక్ న్యూస్ అని తేల్చి చెప్పింది. కాగా, రూ. 500 నోటుపై రాముడి చిత్రం ముద్రించనున్నారని, ప్రాణప్రతిష్ఠ సందర్భంగా జనవరి 22న ఈ కొత్త రూ.500 నోటు అమల్లోకి రానుందని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది.