పండగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి

పండగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని బోధన్ ఏసీపి శ్రీనివాస్ సూచించారు. శనివారం సాయంత్రం పట్టణ సిఐ కార్యాలయంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. బక్రీద్ పండుగ సందర్భంగా శాంతి కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏసీబీ మాట్లాడుతూ పండగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఒకరికి ఒకరు సహకరించుకుంటూ పండగలను నిర్వహించుకోవాలన్నారు. పండగలు మతసామరస్యానికి ప్రతీక అని కొనియాడారు.

సంబంధిత పోస్ట్