మున్సిపల్ కార్మికుల హక్కులకై పోరాటానికి సిద్ధం - రమేష్ బాబు

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో ఆదివారం సిఐటియు నాయకుడు చంద్ర సింహా సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు రమేశ్ బాబు మాట్లాడుతూ కార్మికులంతా ఐక్యంగా పోరాడినప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. అందుకు కార్మికులందరూ ఏకమై పోరాటానికి సిద్ధం కావాలని సూచించారు. ఈ సమావేశంలో కార్మికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్