కొవిడ్ మహమ్మారి మధుమేహులపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. మధుమేహం ఉన్నవారు కంటిచూపు కోల్పోయిన ఘటనలు కొవిడ్ మహమ్మారి విజృంభణ తర్వాత పెద్ద సంఖ్యలో నమోదయ్యాయి. కొవిడ్ తర్వాత మరణాలు సంభవించడమే కాకుండా డయాబెటిస్ సమస్యతో ఐసీయూల్లో పిల్లల చేరికలు కూడా పెరుగుతున్నాయని తేలింది. ప్రాణాంతక సమస్యగా భావించే డయాబెటిక్ కెటోయాసిడోసిస్ (డీకేఏ) కేసులూ పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.