హైదరాబాద్ లోని తాజ్ కృష్ణలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం కొనసాగుతుంది. స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ హరీశ్ చౌదరి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశం.. గత 3 గంటలుగా కొనసాగుతుంది. ఖమ్మం, కరీంనగర్, వరంగల్ పార్లమెంటు నియోజకవర్గాల నాయకులతో
హరీశ్ చౌదరి భేటీ అయ్యారు. దీపాదాస్ మున్షీ, రోహిత్ చౌదరి, విష్ణునాథ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి, వి.హనుమంతురావు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.