ఈపీఎఫ్ఓ 2020లో ప్రయాస్ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం కింద ఈపీఎఫ్ఓ పరిధిలోకి వచ్చే కార్మికులు, ఉద్యోగులకు ఉద్యోగ విరమణ రోజే పింఛను మంజూరు చేయాలి. ఈ పథకం అమల్లోకి వచ్చినప్పటికీ క్లెయిమ్ల పరిష్కారంలో నిర్లక్ష్యం, సరైన వివరాలు లేవన్న కారణాలతో పీపీవోలు మంజూరు చేయలేదు. ఇటీవల సమీక్ష నిర్వహించిన ఈపీఎఫ్ఓ క్షేత్రస్థాయి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సత్వరం పదవీ విరమణ ప్రయోజనాలు కల్పించాలని స్పష్టం చేసింది.