ఈ ఎన్నికల్లో నియంత పాలన పనిచేయదని ప్రజలు స్పష్టంగా తీర్పు ఇచ్చారని శివసేన (యూబీటీ) రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది అన్నారు. పాలకులు ప్రజాస్వామ్యాన్ని అనుసరించాలని ప్రజలు తేల్చిచెప్పారని తెలిపారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను సీబీఐ అరెస్ట్ చేసిన తీరుపై, సునీతా కేజ్రీవాల్ ప్రకటనలపై ఆమె స్పందించారు. ఎన్నికైన సీఎం, రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ చీఫ్ పట్ల మోదీ సర్కార్ వ్యవహార శైలిని తప్పుపట్టారు.