పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ను రిటర్నింగ్ అధికారి పర్యవేక్షిస్తారు. ముందుగా ETPBS(మిలిటరీ, పారామిలిటరీ) ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత రెగ్యులర్ బ్యాలెట్లను టేబుల్స్ సంఖ్య ఆధారంగా డివైడ్ చేసి వెరిఫై చేస్తారు. వాటిలో టేబుల్ కు సుమారుగా 500 చొప్పున పంచి లెక్కిస్తారు. ఒకవేళ ఏమైనా రిజెక్ట్ అయితే రిటర్నింగ్ ఆఫీసర్ రీచెక్ చేసి నిర్ధారిస్తారు. ఎంపీకి తెలుపు, ఎమ్మెల్యేకు పింక్ రంగులో బ్యాలెట్ కవర్లు ఉంటాయి.