భారతదేశంలో ఎన్నికలు ముగిశాయి. త్వరలో మరోసారి మోదీ నాయకత్వంలో కొత్త ప్రభుత్వం రూపుదిద్దుకోనుంది. ఈ నేపథ్యంలో నేడు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మోదీకి ఫోన్ చేశారు. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాక్ సలీవాన్ న్యూడిల్లీ పర్యటన ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే అమెరికా ప్రతినిధి భారత్ పర్యటన తేదీలు ఇంకా ప్రకటించ లేదు.