పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు భారీ ఊరట లభించింది. తోషాఖానా అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీకి విధించిన శిక్షను ఇస్లామాబాద్ హైకోర్టు రద్దు చేసింది. ఈ కేసులో విధించిన 14 ఏళ్ల శిక్షను ఇమ్రాన్ ఖాన్ దంపతులు హైకోర్టులో సవాలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పాకిస్థానీ హైకోర్టు శిక్షను తాత్కాలికంగా నిలిపివేస్తూ బెయిల్ మంజూరు చేసింది.