ఇంగ్లండ్, భారత్ మధ్య జరుగుతున్న T20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచుకు వర్షం ఆటంకం కలిగించింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్ 8 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 65 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ (37), సూర్య(13) ఉన్నారు. మళ్లీ వర్షం వచ్చేసింది. ఆటగాళ్లు డగౌట్కు వెళ్లిపోయారు. పిచ్ను కవర్లతో కప్పేశారు. అంతకుముందు వర్షం కారణంగా టాస్ ఆలస్యమైన సంగతి తెలిసిందే.