సంచలన డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని ప్రధాన పాత్రలో వస్తోన్న తాజా చిత్రం డబుల్ ఇస్మార్ట్. ఇస్మార్ట్ శంకర్కు సీక్వెల్గా ఈ చిత్రం వస్తోంది. కావ్య థాపర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ నుంచి తాజాగా మేకర్స్ అప్డేట్ ఇచ్చారు.'ఈ సారి మాస్ మ్యూజిక్ జాతర ఉండబోతుంది.. వేచి ఉండండి. అంటూ డబుల్ ఇస్మార్ట్ గెటప్లో స్టైలిష్గా నడుచుకుంటూ వెళ్తున్న రామ్ లుక్ను విడుదల చేసింది. ఈ మూవీ ఆగస్టు 15న విడుదల కానుంది.