రామోజీరావు అంతిమయాత్ర ప్రారంభం

ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు అంతిమ యాత్ర రామోజీ ఫిల్మ్‌సిటీలోని ఆయన నివాసం నుంచి ప్రారంభమైంది. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో రామోజీ ఫిల్మ్‌సిటీలోని స్మృతివనంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంతిమ సంస్కారాలు వీక్షించేందుకు స్మృతివనంలో ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేశారు. అక్షర యోధుడికి కడసారి వీడ్కోలు పలికేందుకు ప్రముఖులు, రాజకీయ నాయకులు, ఈనాడు సంస్థల ఉద్యోగులు భారీగా హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్