వీధి కుక్కల దాడిలో బాలుడి మృతి

53చూసినవారు
వీధి కుక్కల దాడిలో బాలుడి మృతి
జనగామ జిల్లా చిల్పూర్‌ మండలం లూనావత్‌ తండాలో శనివారం వీధి కుక్కల దాడిలో ఓ బాలుడు మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. తండాకు చెందిన గుగులోత్‌ మధు, సరిత దంపతులు తమ రెండో కుమారుడు అభిరామ్‌ (6)ను ఇంటి వద్ద వదిలి పనుల నిమిత్తం వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. సాయంత్రం ఇంటికి రాగా కుమారుడు కనిపించకపోవడంతో వెతుకుతుండగా శివారులోని పొలంలో మృతి చెంది కనిపించాడు. గ్రామంలో గుంపులుగా ఉన్న వీధి కుక్కలు బాలుడిని తీవ్రంగా కరిచి, పొలంలోకి లాక్కెళ్లి ఉంటాయని అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు కాలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్