రియల్మీ జీటీ 6టీ ఫోన్ భారత్లో విడుదలైంది. దేశంలో క్వాల్కామ్ 4NM స్నాప్డ్రాగన్ 7+ జెన్ 3 ప్రాసెసర్తో వచ్చిన తొలి ఫోన్ ఇదే. గరిష్ఠంగా 12GB RAM, 512GB స్టోరేజ్తో వస్తోంది. 120W సూపర్వూక్ ఛార్జింగ్ సపోర్ట్తో 5,500mAh బ్యాటరీని ఇచ్చారు. పది నిమిషాల్లో 50 శాతం ఛార్జ్ అవుతుంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.30,999 గా కంపెనీ నిర్ణయించింది. మే 29 నుంచి కంపెనీ ఆన్లైన్ స్టోర్ సహా అమెజాన్లో విక్రయాలు ప్రారంభమవుతాయి.