రాచరిక చట్టాలపై అసమ్మతి గళం వినిపించి, జైలుకెళ్లిన ఓ యువ మహిళా కార్యకర్త.. అక్కడే నెలల తరబడి నిరాహార దీక్షకు దిగారు. ఈ క్రమంలోనే ఆరోగ్యం విషమించి మంగళవారం మృతిచెందారు. థాయ్లాండ్కు చెందిన నెటిపోర్న్ సానెసాంగ్ఖోమ్ (28).. రాచరికాన్ని బహిరంగంగానే విమర్శించే ‘థాలువాంగ్’ బృందానికి చెందిన ప్రముఖ హక్కుల కార్యకర్త. దేశంలో నిరాహార దీక్ష చేసి మృతిచెందిన తొలి రాజకీయ కార్యకర్తగా ఆమెను పేర్కొంటున్నారు.