నేపాల్కు చెందిన దిగ్గజ పర్వతారోహకుడు కామి రిటా షెర్పా 29వ సారి ఎవరెస్ట్ను అధిరోహించి.. తన రికార్డ్ను తానే తిరగ రాసుకున్నాడు. 54 ఏండ్ల వెటరన్ పర్వతారోహకుడు కామి రిటా ఇక్కడి ‘సెవెన్ సమ్మిట్ ట్రెక్స్’లో సీనియర్ గైడ్గా పనిచేస్తున్నారు. అతను 2024 మే 12 (ఆదివారం) ఉదయం 7.25 గంటలకు ఎవరెస్ట్పై 8,849 మీటర్లకు చేరుకున్నాడని ఇక్కడి టూరిజం శాఖ తెలిపింది.