రోజూ మల్టీవిటమిన్ సప్లిమెంట్లు తీసుకోవడంతో మనుషుల ఆయుష్షు పెరగదని US నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ పరిశోధనలో తేలింది. 1990-2010 మధ్య దాదాపు 4లక్షల మందిపై సైంటిస్టులు అధ్యయనం చేశారు. మల్టీవిటమిన్లతో ఆరోగ్యానికి ప్రమాదమని, త్వరగా మరణించే ముప్పు 4% పెరిగిందని గుర్తించారు. సప్లిమెంట్ల కంటే కూరగాయలు, తృణధాన్యాలు లాంటి ఆహారం తీసుకోవడం మంచిదని, మద్యం, మాంసం తగ్గించాలని సూచించారు.