స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచింది. రూ.2 కోట్లలోపు రిటైల్ డిపాజిట్లపైనా, అలాగే, రూ.2 కోట్ల పైబడిన బల్క్ డిపాజిట్లపైనా వడ్డీ రేట్లను సవరించింది. కొత్త వడ్డీ రేట్లు మే 15 నుంచి అమల్లోకి వచ్చినట్లు SBI తన వెబ్సైట్లో పేర్కొంది. రూ.2 కోట్లలోపు రిటైల్ డిపాజిట్లపై SBI గరిష్టంగా 75 బేసిస్ పాయింట్ల మేర SBI వడ్డీని పెంచింది.