క్వింటాకు రూ.500 బోనస్‌ ఇచ్చేవరకు వదిలిపెట్టం: కేటీఆర్‌

60చూసినవారు
క్వింటాకు రూ.500 బోనస్‌ ఇచ్చేవరకు వదిలిపెట్టం: కేటీఆర్‌
రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు ధర్నా చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అన్నారు. బుధవారం తెలంగాణ భవన్ లో మాట్లాడుతూ.. 'ధాన్యం కొనుగోళ్లను వెంటనే ప్రారంభించి.. తరుగు లేకుండా, తడిచిన ధాన్యం కొనుగోలు చేయాలి. కామారెడ్డి, నిర్మల్‌ జిల్లా లక్ష్మణ్‌ చందా, భువనగిరి జిల్లా బీబీనగర్‌, సిరిసిల్ల మల్కపేటలో రైతులు రోడ్డెక్కారు. క్వింటాకు రూ.500 బోనస్‌ ఇచ్చేవరకు ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం' అని అన్నారు.

సంబంధిత పోస్ట్