వరుస రైలు ప్రమాదాలు కారణంగా వందేభారత్, గతిమాన్ ఎక్స్ప్రెస్ల వేగంపై రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఢిల్లీ హజ్రత్ నిజాముద్దీన్- ఝాన్సీ మధ్య గతిమాన్ ఎక్స్ప్రెస్, రెండు వందేభారత్ రైళ్లు గంటకు 160 కి.మీ. వేగంతో నడుస్తున్నాయి. ఏటీపీ వ్యవస్థ అందుబాటులోకి వచ్చే వరకూ ఈ రెండు రైళ్ల గరిష్ఠ వేగాన్ని 130 కి.మీ.కు తగ్గించాలని ఉత్తర మధ్య రైల్వే జోన్ జనరల్ మేనేజర్కు లేఖ రాశారు.