సిరిసిల్ల నియోజకవర్గం గంభీరావుపేట మండలం నాగంపేట గ్రామంలో విషాదం నెలకొంది. గుండెపోటుతో గ్రామానికి చెందిన సుంకోజు నరేష్(29) మృతి చెందాడు. స్వర్ణకారుడు నరేష్ మంగళవారం ఉదయం ఛాతిలో నొప్పి అంటూ ఒక్కసారిగా కుప్పకూలాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్థారించారు. మృతునికి భార్య, పిల్లలు ఉన్నారు.