దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:21 గంటల సమయంలో సెన్సెక్స్ 167 పాయింట్ల నష్టంతో 78,506 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 36 పాయింట్లు కుంగి 23,832 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.52 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్-30 సూచీలో అల్ట్రాటెక్ సిమెంట్, JSW స్టీల్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, NTPC, బజాజ్ ఫిన్సర్వ్, టాటా మోటార్స్ పలు కంపెనీల షేర్లు లాభాల్లో ఉన్నాయి.