లాభాల్లో స్టాక్ మార్కెట్లు ప్రారంభం

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభం అయ్యాయి. ఉదయం 9.15 గంటల సమయానికి సెన్సెక్స్ 147.65 పాయింట్లు లాభపడి 76,604.24 వద్ద, నిఫ్టీ 48.70 పాయింట్లు పెరిగి 23,313.50 వద్ద ఉన్నాయి. దాదాపు 2001 షేర్లు లాభపడగా, 496 షేర్లు క్షీణించాయి. 105 షేర్లు మారలేదు. నిఫ్టీలో HCL టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, BPCL, విప్రో లాభాల్లో ఉండగా, ఏషియన్ పెయింట్స్, టైటాన్, గ్రాసిమ్, NTPC నష్టపోయాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్