మహారాష్ట్రలో బీజేపీ-శివసేన-ఎన్సీపీలతో కూడిన అధికార కూటమికి లోక్ సభ ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగిలింది. 48 స్థానాల్లో కేవలం 17 స్థానాలకే పరిమితమైంది. ఈ పరిణామాలపై సీఎం ఏక్నాథ్షిండే కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని వ్యవసాయ గడ్డు పరిస్థితులకు.. ఎన్నికల ఫలితాల రూపంలో తమ కూటమి భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. నాసిక్ ప్రాంతంలో ‘ఉల్లి’ ఏడిపించిందని వ్యాఖ్యానించారు.