దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 941 పాయింట్లు లాభపడి 74,671 వద్ద, నిఫ్టీ 223 పాయింట్లు పెరిగి 22,643 వద్ద ఉన్నాయి. నిఫ్టీలో ICICI బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, SBI, అల్ట్రాటెక్ సిమెంట్, యాక్సిస్ బ్యాంక్ టాప్ గెయినర్లుగా నిలిచాయి. HCL టెక్, అపోలో హాస్పిటల్స్, బజాజ్ ఆటో, HDFC లైఫ్ తదితర షేర్లు నష్టపోయాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.48గా ఉంది.