కారు ఢీకొట్టడంతో పల్టీ కొట్టిన ఆటో.. పలువురికి తీవ్ర గాయాలు

సూర్యాపేట జిల్లా మద్దిరాలలో మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సూర్యాపేట నుంచి వస్తున్న ఆటోని దంతాలపల్లి వైపు నుంచి వేగంగా వస్తున్న కారు ఢీకొనడంతో రోడ్డు పక్కనే ఉన్న గుంతలో ఆటో బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న మద్దిరాలకి చెందిన ముగ్గురు వ్యక్తులకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఆటోను ఢీకొన్న అనంతరం ఎదురుగా వస్తున్న మరో స్కూటీని ఢీకొట్టడంతో స్కూటీపై ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయాలయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్