టీ20 వరల్డ్ కప్ సూపర్-8 మ్యాచ్లో ఇంగ్లండ్ బోణీ కొట్టింది. సెయింట్ లూయిస్లో గురువారం జరిగిన మ్యాచ్లో వెస్టిండీస్పై 8 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 180/4 స్కోరు సాధించింది. ఈ లక్ష్యాన్ని ఇంగ్లండ్ 17.3 ఓవర్లలో ఛేదించింది. ఇంగ్లండ్ ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ (83*) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బెయిర్ స్టో (48*), బట్లర్ (25) రాణించడంతో ఇంగ్లండ్ గెలుపు తీరాలకు చేరింది.