ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి టీడీపీ కార్యకర్తలు, అభిమానులు తరలి వెళ్లారు. రాజధాని అమరావతి పరిధిలోని వెంకటపాలెం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు టీడీపీ నేతలు పడవల్లో వెళ్లారు. పడవలకు పార్టీ జెండాలను కట్టి జై చంద్రబాబు, జై తెలుగుదేశం నినాదాలతో సందడి చేశారు.